ఎటపాకలో వైసీపీ ఎంపీటీసీ దారుణహత్య

ఎటపాకలో వైసీపీ ఎంపీటీసీ దారుణహత్య

భద్రాచలం, వెలుగు:  ఆంధ్రాలో విలీనమైన అల్లూరి జిల్లా ఎటపాక మండలం కన్నాయిగూడెం వైసీపీకి చెందిన ఎంపీటీసీ వర్సా బాలకృష్ణ(40) గురువారం అర్ధరాత్రి దారుణహత్యకు గురయ్యారు. రాజకీయ కక్షల కారణంగానే బాలకృష్ణను హతమార్చినట్టు తెలుస్తోంది. గతంలో జరిగిన రాజకీయ తగాదాల నేపథ్యంలో అతనిని దారికాచి ఓ ఫంక్షన్​ కు వెళ్లి వస్తుండగా కన్నాయిగూడెం గ్రామ సమీపంలో దాడి చేశారు. అతడి తలపై బండరాయితో కొట్టి  చంపేశారు. కృష్ణను హత్య చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్, గోండ్వాన సంక్షేమ పరిషత్​నాయకులు డిమాండ్ చేశారు. ఎటపాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.