ఆత్మహత్యకు పాల్పడిన యువదంపతులు

ఆత్మహత్యకు పాల్పడిన యువదంపతులు

ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన కొత్త జంట పెళ్లైన సంవత్సరానికే ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ విషాద సంఘటన వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానిక హరిహారపురం కాలనీలో నివాసముంటున్న రాఘవేందర్, సోనీలకు సంవత్సరం క్రితం వివాహం జరిగింది. కొంత కాలం సాఫీగానే సాగిన వీరి కాపురంలో కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవల నేపథ్యంలోనే ఈ నవదంపతులిద్దరూ ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో భార్య సౌమ్య(సోనీ) మృతి చెందగా.. భర్త రాఘవేందర్ పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని వారిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

For More News..

హాస్టల్ బాత్రూంలో ఇంటర్ విద్యార్థిని సూసైడ్

ఓయూలో రేపు జాబ్​ మేళా

హాస్టల్‌లో ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. మృతదేహం కోసం గొడవ