ముషీరాబాద్: జాబ్ రాలేదని మనస్తాపంతో యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన చిక్కడపల్లి పీఎస్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ నరేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా చౌడపురం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన సుర్క రాఘవేంద్ర(23) సిటీలోని
బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశాడు. ఏడాది కాలంగా జాబ్ కోసం తిరుగుతున్న రాఘవేంద్ర.. చిక్కడపల్లిలోని తన తమ్ముడు బాలకృష్ణతో కలిసి ఓ రూమ్లో ఉంటున్నాడు. గురువారం బాలకృష్ణ కాలేజీకి వెళ్లాడు. మధ్యాహ్నం 1 గంట సమయంలో రాఘవేంద్ర రూమ్లో ఉరేసుకున్నాడు. పోలీసులు డెడ్బాడీని గాంధీకి తరలించారు. బాలకృష్ణ ఇచ్చిన కంప్లయింట్ మేరకు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.