అమ్మాయి ప్రేమిస్తలేదని యువకుడి సూసైడ్​

అమ్మాయి ప్రేమిస్తలేదని యువకుడి సూసైడ్​

హుస్నాబాద్​, వెలుగు : అమ్మాయి ప్రేమించడంలేదని ఓ యువకుడు  సూసైడ్​ చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో జరిగింది. ఎస్సై మహేశ్, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. హుస్నాబాద్​లోని హనుమాన్​నగర్​కు చెందిన బొల్లి గణేశ్​(26)  ఆటో నడుపుతూ తల్లితో కలిసి ఉంటున్నాడు. కొంతకాలంగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని, తన ప్రేమను అంగీకరించాలని ఆమె వెంట తిరుగుతున్నాడు. ఇందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో నిత్యం మద్యం తాగుతుండేవాడు. 

Also Read : గవర్నర్ బీసీ వ్యతిరేకి : మంత్రి గంగుల

సోమవారం స్కూల్​ పిల్లను తన ఆటోలు ఇంటికి తీసుకువస్తూ ఇక నుంచి తాను ఆటో నడపబోనని, వేరే ఆటోను మాట్లాడుకోవాలని వారితో చెప్పాడు. తన చెల్లెలు, బంధువులు, ఫ్రెండ్స్​తో కూడా ఫోన్​లో మాట్లాడి అందరూ బాగుండాలని, ఇక నుంచి తాను కనిస్తానో.. లేదోనని చెప్పాడు. దీంతో అనుమానం వచ్చి వెంటనే అతడి తల్లికి  వారు సమాచారం ఇచ్చారు. 

బయటకు వెళ్లిన ఆమె ఇంటికి వచ్చి చూడగా గణేశ్​ ఉరి వేసుకొని కనిపించాడు. ఆసుపత్రికి తీసుకెళ్లాగా అప్పటికే అతడు చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. అమ్మాయి ప్రేమించడంలేదనే బాధతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు.  మృతుడి  బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.