ప్రేమజంట దాడిలో గాయపడిన యువకుడు మృతి

ప్రేమజంట దాడిలో గాయపడిన యువకుడు మృతి

గురువారం  నెక్లెస్ రోడ్డులో బర్త్ డే పార్టీ చేసుకునేందుకు వచ్చిన  సాయిసాగర్  స్నేహబృందం అక్కడ  అసభ్యంగా ప్రవర్తిస్తున్న ప్రేమజంటకు అభ్యంతరం చెప్పారు. దీంతో ప్రేమజంటకు, ఈ మిత్రబృందాని మధ్య వాగ్వాదం జరిగింది.

ఈ గొడవలో ప్రియుడు మోబిన్..  సాగర్ పై తీవ్రంగా దాడి చేశాడు. పిడిగుద్దులు గుద్దడంతో సాగర్ అపస్మారక స్థితిలోకి వెళ్లి పోయాడు. పోలీసులకు ఈ విషయం తెలియడంతో మోబిన్ అదుపులోకి తీసుకున్నారుప. సాగర్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. రెండు రోజుల తర్వాత ఈ ఉదయం మరణించాడు.

అతను మృతికి కారణమైన మోబిన్ ను రాం గోపాల్ పేట పోలీసులు ఇప్పటికే రిమాండ్ కు తరలించారు. అతనిపైన ఇంతకు ముందే 16 కేసులు ఉన్నట్లు, మిర్యాలగూడలో కేసులతో పాటు గా పీడీ యాక్ట్ లో అరెస్ట్ అయినట్లు పోలీసులు గుర్తించారు.