ప్రేమించిన అమ్మాయి చనిపోయిందని యువకుడి సూసైడ్

ప్రేమించిన అమ్మాయి చనిపోయిందని యువకుడి సూసైడ్

ములుగు, వెలుగు: తాను ప్రేమించిన యువతి అనారోగ్యంతో చనిపోయిందని తెలిసి ఓ యువకుడు సూసైడ్​చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ములుగు మండలం దేవగిరిపట్నంకు చెందిన నగావత్​విజయ, రవి కూతురు రుక్మిణి(20). అదే గ్రామానికి చెందిన కేలోతు లక్ష్మి, వీరన్నల కొడుకు మహేందర్(22). కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే రుక్మిణి అయిదురోజులుగా కడుపునొప్పితో బాధపడుతుంటే తల్లిదండ్రులు ములుగులోని ప్రైవేట్ హాస్పిటల్​లో చేర్పించారు. మెరుగైన ట్రీట్​మెంట్​కోసం అక్కడి నుంచి హన్మకొండలోని ప్రైవేట్​హాస్పిటల్​కు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం చనిపోయింది. హైదరాబాద్​లో జాబ్​చేస్తున్న మహేందర్​కు ఈ విషయం తెలిసి డిప్రషెన్ కు గురయ్యాడు. మంగళవారం సిటీలోని తన రూమ్​లో ఉరి వేసుకుని సూసైడ్​చేసుకున్నాడు. ఒక్కగానొక్క కొడుకు చనిపోయాడని తెలిసి యువకుడి పేరెంట్స్​బోరున విలపించారు. కాగా యువతి అంత్యక్రియలు మంగళవారం ఉదయం జరగగా మహేందర్​డెడ్​బాడీ సాయంత్రానికి గ్రామానికి చేరుకుంది. దీంతో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి.