ములుగు, వెలుగు: తాను ప్రేమించిన యువతి అనారోగ్యంతో చనిపోయిందని తెలిసి ఓ యువకుడు సూసైడ్చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ములుగు మండలం దేవగిరిపట్నంకు చెందిన నగావత్విజయ, రవి కూతురు రుక్మిణి(20). అదే గ్రామానికి చెందిన కేలోతు లక్ష్మి, వీరన్నల కొడుకు మహేందర్(22). కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే రుక్మిణి అయిదురోజులుగా కడుపునొప్పితో బాధపడుతుంటే తల్లిదండ్రులు ములుగులోని ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. మెరుగైన ట్రీట్మెంట్కోసం అక్కడి నుంచి హన్మకొండలోని ప్రైవేట్హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం చనిపోయింది. హైదరాబాద్లో జాబ్చేస్తున్న మహేందర్కు ఈ విషయం తెలిసి డిప్రషెన్ కు గురయ్యాడు. మంగళవారం సిటీలోని తన రూమ్లో ఉరి వేసుకుని సూసైడ్చేసుకున్నాడు. ఒక్కగానొక్క కొడుకు చనిపోయాడని తెలిసి యువకుడి పేరెంట్స్బోరున విలపించారు. కాగా యువతి అంత్యక్రియలు మంగళవారం ఉదయం జరగగా మహేందర్డెడ్బాడీ సాయంత్రానికి గ్రామానికి చేరుకుంది. దీంతో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి.