Viral Photo:యువకుడ్ని చితక్కొట్టిన నలుగురు దుండగులు

Viral Photo:యువకుడ్ని చితక్కొట్టిన నలుగురు దుండగులు

మధ్యప్రదేశ్​లో దారుణ ఘటన వెలుగు చూసింది.  ధాతియాలో ఇరుగు పొరుగు తగాదా తీవ్రరూపం దాల్చింది. నలుగురు దుండగులు ఓ యువకుడిని కొట్టి కోడిపిల్లలా కూర్చోబెటటొన ఫొటోలు సోషల్​ మీడియాలో  వైరల్​ అవుతున్నాయి.   పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...

బైక్​ పై వెళ్తున్న ఓ యువకుడిని నలుగురు వ్యక్తులు అడ్డగించి మద్యం కోసం డబ్బులు డిమాండ్​ చేశారు.  అతను నిరాకరించడంతో బెల్టుతో కొట్టి కోడి మాదిరిగా కూర్చోబెట్టారని దతియాస్ కొత్వాలీ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ధీరేంద్ర మిశ్రా తెలిపారు.  , రాజ్‌ఘాట్ కాలనీలోని హనుమాన్‌ఘర్ దేవాలయం సమీపంలో ఈ సంఘటన జరిగింది. నిందితులను అభిషేక్ యాదవ్, గౌరవ్ తివారీ, అం కిత్ యాదవ్, ఛోటూ అలియాస్​  అమిత్ యాదవ్‌లుగా గుర్తించారు. ఛోటూ అలియాస్​  అమిత్ యాదవ్‌లు కొట్టినట్టు పోలీసులు తెలిపారు.  ప్రధాన నిందితుడు అభిషేక్​ యాదవ్​ను అరెస్ట్​ చేసినట్లు తెలిపారు.  మిగతా ముగ్గురి నిందితుల కోసం గాలిస్తున్నారు. 

బాధితుడు, నిందితులు ఇరుగు పొరుగువారని పోలీసులు తెలిపారు.  వారి మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయన్నారు.  ఇప్పటికే ఇరు వర్గాలపై క్రిమినల్​ కేసులు నమోదైనట్లు తెలిపారు.