ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి వెళ్లి లండన్లో కామారెడ్డి జిల్లా యువకుడు మృతి

ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి వెళ్లి లండన్లో కామారెడ్డి జిల్లా యువకుడు మృతి

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ స్టూడెంట్ లండన్​లో అనుమానాస్పదస్థితిలో చనిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం తలమడ్లకు చెందిన సావుసాని మంజుల, మధుసూదన్ రెడ్డి కొడుకు శ్రీనాథ్​రెడ్డి(25) ఎంఎస్ చేసేందుకు 14 నెలల కింద లండన్ వెళ్లాడు.

అక్కడి లీసెస్టర్​ యూనివర్సిటీలో ఎంఎస్ సెకండ్ ఇయర్​చదువుతున్నాడు. బుధవారం తన ఫ్రెండ్​బర్త్​డే పార్టీకి వెళ్లిన శ్రీనాథ్​రెడ్డి రాత్రి ఫ్రెండ్ రూమ్ లోనే పడుకున్నాడు. మర్నాడు ఉదయం ఎంతకూ లేవకపోవడంతో అతడి స్నేహితులు పరిశీలించగా చనిపోయి కనిపించాడు.

వెంటనే వారు లండన్​లోనే ఉంటున్న శ్రీనాథ్​రెడ్డి బంధువులకు సమాచారం ఇచ్చారు. శ్రీనాథ్​రెడ్డి చనిపోయిన విషయాన్ని అతడి బంధువులు కామారెడ్డిలోని ఫ్యామిలీ మెంబర్స్​కు చెప్పారు. శ్రీనాథ్ రెడ్డి ఎలా చనిపోయాడో తమకు ఇంకా తెలియడం లేదని కుటుంబసభ్యులు చెప్తున్నారు. శ్రీనాథ్​డెడ్​బాడీని తలమడ్లకు తెప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.