
ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఎక్స్ వేదికగా కీలక ట్వీట్ చేశారు వైసీపీ అధినేత జగన్.. ఇదేనా మీరు చెప్పుకునే దశాబ్దాల అనుభవం అంటూ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు జగన్. వైసీపీ హయాంలో చేసిన అప్పులో సుమారు 44 శాతం ఏడాదిలోనే చేశారంటూ మండిపడ్డారు జగన్. సంక్షేమాన్ని, అభివృద్ధిని పూర్తిగా విసమరించారని అన్నారు.దశాబ్దాల అనుభవం ఉందని, పాలనపై మీకు లోతైన అవగాహన ఉందని చెప్పుకునే మీరు రాష్ట్రానికి చేసిందేంటని ప్రశ్నించారు జగన్.
ఈ ఒక సంవత్సరం కాలంలో, మీ ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించి చేసిందేమీ లేదని అన్నారు.. CAG & MOSPI విడుదల చేసిన గణాంకాలు మీ ప్రభుత్వ అసమర్థను ఆర్థిక దుర్వినియోగం గురించి దిగ్భ్రాంతికరమైన వాస్తవాలను వెల్లడిస్తున్నాయని అన్నారు జగన్.
GSDP ఆర్థిక లోటు 4.08% నుండి 5.12% వరకు పెరిగింది
GSDP ఆదాయ లోటు 2.65% నుండి 3.61% వరకు పెరిగింది
కరోనా వ్యాప్తి వంటి ప్రతికూల పరిస్థితులు లేనప్పటికీ, GSDPలో అప్పు 35.64% శాతంగా ఉందని అన్నారు.
2024-25లో మూలధన వ్యయం కోసం 23.49% రుణాలు మాత్రమే ఉపయోగించబడ్డాయని, వైసీపీ హయాంలో ఇది 33.25% శాతంగా ఉందంటూ కాగ్ డేటాను ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు జగన్.
. @ncbn garu, you claim that you possess decades of experience as CM and your so-called deep understanding of governance, but what have those decades of experience delivered?
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 2, 2025
In just one year, your Government availed a debt equivalent to 44% of the total debt our Government… pic.twitter.com/UD8lWn2SBE
జగన్ ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.. కాగ్ డేటాతో తమ అధినేత సంధించిన ట్వీట్ కి సమాధానం చెప్పే దమ్ము కూటమి సర్కార్ కి లేదంటూ కామెంట్ చేస్తున్నారు వైసీపీ శ్రేణులు.