లిక్కర్ మాఫియాలో దొరికిన కవిత తెలంగాణ పరువు తీసింది: వైఎస్ షర్మిల

లిక్కర్ మాఫియాలో దొరికిన కవిత  తెలంగాణ పరువు తీసింది: వైఎస్ షర్మిల

అమాయకంగా బతుకమ్మ ఆడుతూనే..బతుకమ్మ పూలనే తెలంగాణ ప్రజల చెవిలో పెట్టి లిక్కర్ మాఫియాలో దొరికిన ఘనత ఎమ్మెల్సీ కవితదేనని వైఎస్సార్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. తెలంగాణలో  ఆడిన బతుకమ్మ సరిపోలేదని..కవిత ఇతర రాష్ట్రాల్లో అట్ల తద్ది చేసేందుకు బయలుదేరిందని ఎద్దేవా చేశారు. ఒకప్పుడు సామాన్య అపార్ట్మెంట్లో నివసించిన కల్వకుంట్ల కవిత.. ఇవాళ వేల కోట్లకు ఎలా పడగలెత్తిందని ప్రశ్నించారు. లిక్కర్ స్కాంలో దొరికిన కవిత..మహిళల పరువే కాదు..తెలంగాణ పరువు తీసిందని మండిపడ్డారు. 

కేసీఆర్ బిడ్డ కాబట్టే కవితకు తెలంగాణలో ఉనికి ఉందని వైఎస్ షర్మిల అన్నారు. కేసీఆర్ బిడ్డ అయి ఉండి కూడా ఎంపీగా ఓడిపోయారని ఎద్దేవా చేశారు. ఓడిపోయినా కూడా తన బిడ్డకు ఎమ్మెల్సీ ఇచ్చారని చెప్పారు. ఆత్మగౌరవం గురించి మాట్లాడే కవిత...శ్రీకాంత చారి తల్లికి ఎందుకు ఎమ్మెల్సీ ఇవ్వలేదని ఎప్పుడైనా కేసీఆర్ను అడిగారా అని ప్రశ్నించారు.