పూర్తిగాని ప్రాజెక్టును ప్రారంభించుడేంది?... సీఎం కేసీఆర్​పై షర్మిల ఫైర్​

పూర్తిగాని ప్రాజెక్టును ప్రారంభించుడేంది?...  సీఎం కేసీఆర్​పై షర్మిల ఫైర్​

హైదరాబాద్, వెలుగు :  పాలమూరు-–రంగారెడ్డి ప్రాజెక్టులో 31 మోటార్లకు ఒకే ఒక్కటి పూర్తి చేసి దక్షిణ తెలంగాణ మొత్తాన్ని సస్యశ్యామలం చేస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటు న్నారని కేసీఆర్​పై  వైఎస్సార్​ టీపీ చీఫ్​ షర్మిల ఫైరయ్యారు. వైఎస్సార్​ రూ.35 వేల కోట్లతో పూర్తి చేయాలనుకున్న ప్రాజెక్టును కమీషన్ల కోసం కేసీఆర్​ రూ.52 వేల కోట్లకు పెంచారని శనివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. 

ALSO READ : జమిలి ఎన్నికలపై  23న కోవింద్​ కమిటీ భేటీ

కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల ద్వారా మహబూబ్​నగర్​ జిల్లాలో దాదాపు 10 లక్షల ఎకరాలకు వైఎస్సార్​ నీళ్లిచ్చారని, కేసీఆర్ మాత్రం పాలమూరు–-రంగారెడ్డి ప్రాజెక్టు కింద భూములను పడావు పెట్టారన్నారు. ఇన్నాళ్లూ ప్రాజెక్టు వైపు కన్నెత్తి చూడని కేసీఆర్​.. కేవలం ఎన్నికలు వచ్చాయని హడావుడి చేస్తున్నారన్నారు. అరకొర పనులు చేసి ప్రాజెక్టు మొత్తం పూర్తయిందన్నట్లు ప్రజల్ని మభ్యపెడుతున్నాని మండిపడ్డారు.