మద్యం, భూములు అమ్మితేనే ప్రభుత్వం నడుస్తుంది

మద్యం, భూములు అమ్మితేనే ప్రభుత్వం నడుస్తుంది

వైఎస్సార్ టీపీ  పోరాటంతోనే రాష్ట్రంలో 80వేల ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చిందన్నారు.. ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. మద్యం, భూములు అమ్మితేనే తెలంగాణ ప్రభుత్వం నడుస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కమీషన్లు దండుకుంటూ కేసీఆర్ కుటుంబం చల్లగా ఉందన్నారు. ప్రజాప్రస్థాన యాత్రలో భాగంగా 29వ రోజు  యాదాద్రి జల్లా బీబీ నగర్ మండలం.. భట్టుగూడెం గ్రామస్తులతో మాట ముచ్చట నిర్వహించారు షర్మిల. సంక్షేమ పాలన అందించడమే  వైఎస్సార్ టీపీ  లక్ష్యమన్నారు. రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మర్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు.