కేసీఆర్ కంటే పెద్ద వైరస్ ఏదీ రాదు: వైఎస్ షర్మిల

కేసీఆర్ కంటే పెద్ద వైరస్ ఏదీ రాదు: వైఎస్ షర్మిల

తెలంగాణ సమాజాన్నిపట్టి పీడించే కేసీఆర్ కంటే పెద్ద వైరస్ ఏది రాదన్నారు వైఎస్ షర్మిల. కరోనా కంటే పెద్ద వైరస్ లు వస్తాయని జోస్యం చెప్పిన కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రజలను అప్పుల పాలు చెయ్యడానికి పట్టుకున్న వైరస్ లాంటి వారన్నారు. కేసీఆర్ దరిద్రపు పాలనే తెలంగాణ ప్రజలను పట్టి పీడించే అతి పెద్ద వైరస్ అన్నారు. కేసీఆర్ రాష్ట్ర ఖజానా ఖాళీ చెయ్యడానికి పుట్టిన మహమ్మారి అని ధ్వజమెత్తారు. కరోనాతో పోరాడి నిలిచాం కానీ.. బీఆర్ఎస్ వైరస్ కంట పడితే ఖేల్ ఖతం దుకాణం బంద్ అని అన్నారు. కేసీఆర్ మహమ్మారి పాలన అంతం చేయడానికి ఇంజెక్షన్ రెడీ  అయ్యిందన్నారు షర్మిల.

రాష్ట్రంలో వైద్యాన్ని ఉద్దరించినట్లు ఉద్దెర మాటలు చెప్పే దొర.. గత శంకుస్థాపనల సంగతేంటో చెప్పాలన్నారు షర్మిల.  నగరం నలుమూలల నాలుగు పెద్దాస్పత్రులు ఎక్కడా అని ప్రశ్నించారు. 15 వందల కోట్లతో ఉస్మానియా దవాఖానను కడతామని చెప్పిన ట్విన్ టవర్స్ ఎక్కడా అని నిలదీశారు. 

దొర విలాసాలకు కొత్త సచివాలయం మీద పెట్టిన శ్రద్ధ ప్రజల ఆరోగ్యం మీద లేదన్నారు షర్మిల. కమీషన్ల కోసం కాళేశ్వరం  మీద పెట్టిన శ్రద్ధ ప్రజల ఆరోగ్యం మీద లేదని ధ్వజమెత్తారు. పదేళ్ల తెలంగాణలో   కొబ్బరికాయలు,శంకుస్థాపనలు తప్ప కేసీఆర్ సాధించిందేమి లేదన్నారు.