కేసీఆర్ వడ్ల కొనుగోళ్లపై ఊసరవెల్లిలా మాటలు మారుస్తున్నారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ప్రజాప్రస్థానం పేరుతో ఆమె చేస్తున్న పాదయాత్ర.. 42వ రోజు తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండలంలో కొనసాగింది. అక్కడ ఏర్పాటు చేసిన మాట ముచ్చట కార్యక్రమంలో షర్మిల మాట్లాడారు.
ఓ సారి సన్నొడ్లు వేయాలని చెప్పి రైతులకు నష్టం వచ్చేలా చేశారు. మరోసారి చివరి గింజ వరకు కొంటామని చెప్పి.. కొనకుండా రైతుల ఆత్మహత్యలకు కారణమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కేజీ టూ పీజీ ఉచిత విద్య అని విద్యార్థులను మోసం చేశారు, మూడెకరాల భూమి ఇస్తానని దళితుల్ని మోసం చేశారని షర్మిల ఆరోపించారు. సబ్సిడీ విత్తనాలు లేవు, రైతు రుణమాఫీ లేదు, పంట నష్టపరిహారం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని షర్మిల అన్నారు. 42వ రోజు ప్రజాప్రస్థానం పాదయాత్ర తుంగతుర్తి నియోజకవర్గం కొనసాగుతోంది.
https://t.co/zVxnT924cL రైతు ద్రోహి KCR – ఊసరవెల్లి మాటలతో మోసాలు – వడ్లపై కావాలనే డ్రామాలు – కేసీఆర్ ఒక చేతకాని ముఖ్యమంత్రి – మళ్లీ మళ్లీ నమ్మి, మోసపోవద్దు – దొంగ హామీలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలె – దౌర్జన్యం చేయడంలో ఆరితేరిన మంత్రి,ఎమ్మెల్యే – వృద్ధుల భూములపైనే TRS లీడర్ల కన్ను pic.twitter.com/K5OUqLBXAF
— YS Sharmila (@realyssharmila) March 31, 2022
For More News..