ఉద్యోగాలు అప్పుడు భర్తీ చేస్తాం.. ఇప్పుడు భర్తీ చేస్తామని ఇంకా ఎన్ని ఏండ్లు జరుపుతారని వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రశ్నించారు. జాబ్ నోటిఫికేషన్స్ రాకపోవడంతో వనపర్తి జిల్లా నిర్విన్ కు చెందిన కురుమూర్తి పురుగుల మందు తాగి చనిపోయాడు. ఈ ఘటనపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్పందించారు. ఇంకా ఎంతమంది నిరుద్యోగులు అర్జీ పెట్టుకోవాలని కేసీఆర్ ని నిలదీశారు. ఇంకెంతమంది తల్లులు కడుపుకోతను అనుభవిస్తే పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారని ప్రశ్నించారు. మీ నరంలేని నాలుక ఇంకా ఎన్ని అబద్ధాలాడుతుందని ఎద్దేవాచేశారు. కురుమూర్తి ఆత్మహత్య ఏ మనిషినైనా కదిలిస్తుంది కానీ కేసీఆర్ ని మాత్రం కదిలించదని ఆమె అన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.
నా చావుతోనైన నిరుద్యోగుల ఆత్మహత్యలు అగిపోవాలని మీకు ఇంకెంతమంది నిరుద్యోగులు అర్జీ పెట్టుకోవాలి కెసిఆర్ గారు? ఇంకెంతమంది కన్నతల్లులు కడుపుకోతను అనుభవిస్తే మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారు?త్వరలో ఉద్యోగాలు అని ఇంకా ఎన్ని ఏండ్లు జరుపుతారు?మీ నరంలేని నాలుక ఇంకా ఎన్ని అబద్దాలాడుతుంది?1/2 pic.twitter.com/DfVg9fawYe
— YS Sharmila (@realyssharmila) February 5, 2022
For More News..