- ఏ ఊరిలో చూసినా ధరణి గోసలే: షర్మిల
- కారుకు కర్రు కాల్చివాత పెట్టుడు ఒక్కటే పరిష్కారం
- వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల
హైదరాబాద్: ధరణి పోర్టల్పై వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల విమర్శలు చేశారు. ‘కేసీఆర్ మానస పుత్రిక ధరణి తప్పుల తడకని ఆయన ఎన్నికల అఫిడవిట్ చూస్తేనే అర్థమవుతుంది. స్వయానా ముఖ్యమంత్రికి గుంట భూమి ఎక్కువొచ్చిందంటే ఇక సామాన్యుల సంగతి దేవుడెరుగు. ఉన్నోళ్లకు లేనట్టుగా, లేనోళ్లకు ఉన్నట్టుగా, సర్వే నెంబర్లు మార్చి చూపించే మాయాజాలమే ధరణి.
గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తెచ్చినట్లు ఏ ఊరిలో చూసినా ధరణి గోసలే.ఈ తిప్పలు తప్పాల్నంటే దొర నియంత పాలనను బొంద పెట్టుడు ఒక్కటే మార్గం. ఈ ఎన్నికల్ల కారుకు కర్రు కాల్చివాత పెట్టుడు ఒక్కటే పరిష్కారం’ అని ట్వీట్ లో పేర్కొన్నారు.