మహిళల భద్రతను గాలికొదిలేసి.. మద్యం అమ్మకాలు

మహిళల భద్రతను గాలికొదిలేసి.. మద్యం అమ్మకాలు

బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. చీప్ లిక్కర్ తో BJP... ఖరీదైన మద్యంతో TRS ప్రజలను దోచుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ చూసినా మద్యం, ఏ సమయంలోనైనా మద్యంతో నేతలు ప్రజల రక్తం పీల్చుతున్నారంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. మద్యానికి ప్రజలను, యువతను బానిసలను చేస్తున్నారని.. మహిళల భద్రతను గాలికొదిలేస్తూ, జోరుగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారన్నారు. ప్రతి గ్రామంలోనూ, స్కూళ్ల పక్కన కూడా మద్యం అమ్మకాలను నాయకులు జోరుగా సాగిస్తున్నారు నాయకులు అంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు వైఎస్ షర్మిల.

కాగా, ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించిన ప్రజాగ్రహ సభలో మద్యం ధరలపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే చీప్‌ లిక్కర్‌ రూ.50కే ఇస్తామంటూ  సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సోము కామెంట్స్ పై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ సెటైర్‌లు వేశారు.

సోము వీర్రాజు మాట్లాడిన వీడియోను ట్వట్టర్‌లో పోస్టు చేశారు కేటీఆర్. చీప్ లిక్కర్‌ను రూ.50కి సరఫరా చేయాలనే బీజేపీ జాతీయ విధానామా? లేదా బీజేపీ నిరాశలో ఉన్న రాష్ట్రాలకు మాత్రమే ఈ బంపర్ ఆఫర్ ఉందా? అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ట్వీట్ పై తీవ్రంగా స్పందించిన వైఎస్ షర్మిల.. బీజేపీ చీఫ్ లిక్కర్ అని..టీఆర్ఎస్ కాస్లీ లిక్కర్ అంటూ ట్విట్టర్ లో పోస్టు పెట్టారు.