కేసీఆర్ సర్కార్ పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల మరోసారి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. దొర పాలనలో న్యాయమడిగిన అన్నదాతకు సంకెళ్లు తప్పలేదని, "ఆప్ కి బార్ కిసాన్ సర్కార్ " అంటే ఇదేనా దొరగారు..? అని ప్రశ్నించారు. నమ్ముకున్న భూమిని ఇచ్చేది లేదంటే బేడీలు వేయడమా మీరు ఇచ్చే భరోసా..? అని అడిగారు.
‘‘మద్దతు ధర అడిగితే సంకెళ్లు.. పంట కొనండని అడిగితే సంకెళ్లు..
భూములు పోయాయని అడిగితే సంకెళ్లు.. భూములు ఇవ్వమని చెప్పినా సంకెళ్లు..
ఆక్రందన, ఆవేదన, ఆందోళన ఏది చూపినా రైతుకు దొర ఇచ్చే గిఫ్ట్ సంకెళ్లు’’
అని ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు వైఎస్ షర్మిల.
దేశ చరిత్రలో రైతులను మూడు సార్లు జైలుకి పంపిన చరిత్ర నీదే దొర అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు పోతున్నాయని నిరసన తెలిపితే అరెస్టులు చేయిస్తారా..? అంటూ ప్రశ్నించారు.
‘‘న్యాయమని అడిగిన రైతులకు బేడీలు వేస్తున్న మీ నియంత పాలనకు రోజులు దగ్గర పడ్డాయి. వచ్చే ఎన్నికల్లో ఆ సంకెళ్లు మీకే వేసేందుకు రైతులంతా సిద్ధంగా ఉన్నారు కేసీఆర్’’ అంటూ ట్విట్ చేశారు వైఎష్ షర్మిల.
https://twitter.com/realyssharmila/status/1668903240942112768