9 ముఖ్యమైన హామీలతో వైఎస్సార్ సీపీ మేనిఫెస్టో

 9 ముఖ్యమైన  హామీలతో వైఎస్సార్ సీపీ మేనిఫెస్టో

తొమ్మిది ముఖ్యమైన  హామీలతో  వైఎస్సార్ సీపీ మేనిఫేస్టో 2024 రిలీజ్ చేశారు ఏపీ సీఎం జగన్.  తాడేపల్లి గూడెంలో 2 పేజీలతో మేనిఫెస్టో రిలీజ్ చేశారు. కొన్ని పథకాలను కొనసాగించగా..మరికొన్నిపథకాలను విస్తరించారు. ముఖ్యంగా,విద్య,వైద్యం, రైతులకు సంబంధించిన పథకాలు కొనసాగిస్తామని చెప్పారు జగన్. 

9 ముఖ్యమైన అంశాలివే

  •  విద్య
  • వైద్యం
  •  వ్యవసాయం
  • నాడు -నేడు
  • ఉన్నత విద్య
  •  అభివృద్ధి
  •  పేదలందరికీ ఇళ్లు
  •  మహిళా సాధికారత
  •  సామాజిక భద్రత

మేనిఫేస్టోలో ముఖ్యమైన అంశాలు( జగన్ స్పీచ్)

  • వైఎస్సార్ చేయూత 75 వేల నుంచి  నాలుగు దఫాలుగా లక్షా 50 వేలకు పెంపు 
  • వైఎస్సార్ కాపు నేస్తం 60 వేల నుంచి లక్షా 20 వేలకు పెంపు
  • వైఎస్సార్ ఈబీసీ నేస్తం:   45 వేల నుంచి వచ్చే ఐదేళ్లలో  లక్షా 5 వేలకు పెంపు
  •  జగనన్న అమ్మ ఒడి పథకం:   15 వేల నుంచి 17 వేలకు పెంపు
  • రెండు విడుతల్లో పెన్షన్ 3500లకు పెంపు
  •  వైఎస్సార్ సున్నా వడ్డీలు రూ. 3లక్షలకు పెంపు
  • అర్హులైన పేదలకు ఇళ్లులేని వారికి ఇళ్లు,ఇంటి స్థలం కొనసాగింపు
  • వైఎస్సార్ కళ్యాణమస్తు, షాది తోఫా కొనసాగింపు
  •  వైఎస్సార్  రైతు భరోసా.. రూ.16 వేలు, కౌలు రైతులకు కూడా రైతు భరోసా
  •  జిల్లాకో స్కిల్ డెవ్ లప్ మెంట్ కాలేజీ, తిరుపతిలో స్కిల్ యూనివర్శిటీ
  • వాహన మిత్ర, మత్సకార భరోసా కొనసాగుతాయి
  • 175 స్కిల్  హబ్ లతో యువతకు ఉపాధి  
  •  యూనివర్శిటీల్లో ఖాళీగా ఉన్న 3590 పోస్టులు భర్తీ
  •  లా నేస్తం, చేనేత నేస్తం కొనసాగుతుంది
  • 2025 నుంచి ఒకటో తరగతి నుంచి ఐబీ సిలబస్
  • ఎస్సీ,ఎస్టీ కాలనీలకు ఉచిత కరెంట్
  • మత్స్యకార భరోసా కింద ఐదు విడుతల్లో రూ. 50 వేలు