ఊసరవెల్లి రంగులు మార్చినట్లు కేసీఆర్ మాటలు మార్చుతారన్నారని YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. పోడు భూములకు పట్టాలు ఇస్తానన్న కేసీఆర్.. ఇవ్వకపోగా ఉన్న భూములు గుంజుకుంటున్నారని మండిపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మామిళ్లగూడెంలో ప్రజా ప్రస్థాన యాత్రలో భాగంగా జరిగిన రైతు గోస ధర్నాలో పాల్గొన్నారు. వడ్లు కొంటామన్న కేసీఆర్ ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలనే ప్రారంభించలేదన్నారు. అకాల వర్షాలకు వడ్లు నాని.. మొలకలు వస్తున్నాయన్నారు. వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మరిన్ని వార్తల కోసం