కేసీఆర్ ఊసరవెల్లి

కేసీఆర్ ఊసరవెల్లి

కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నారన్నారని YSRTP అధ్యక్షురాలు YS షర్మిల అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు గూడెం క్రాస్ దగ్గర జరిగిన రైతు గోస ధర్నాలో షర్మిల పాల్గొన్నారు. అంతకుముందు మర్లపాడు క్యాంప్ నుంచి షర్మిల 79 వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవటంతో రైతులు తక్కువ ధరకే ధాన్యాన్ని అమ్ముకుంటున్నారన్నారు. కేసీఆర్ ఊసరవెల్లిలా పూటకో మాట మాట్లాడుతున్నారన్నారు. ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలన్నారు షర్మిల.

మరిన్ని వార్తల కోసం

HDFC అకౌంట్స్‌‌లో కోట్లాది రూపాయలు

సాయం కోసం సోనూ తలుపు తట్టిన జనం