
న్యూఢిల్లీ: జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్ ఇప్పుడు ఎల్ఏటీ ఏరోస్పేస్తో కలిసి భారతదేశంలో ప్రాంతీయ విమాన రవాణా రంగంలోకి అడుగుపెట్టాలని చూస్తున్నారు. ఈ ఏరోస్పేస్ స్టార్టప్ ఫౌండర్ సురోభి దాస్ లింక్డ్ఇన్ పోస్ట్లో ఈ విషయాన్ని వెల్లడించారు.
దీపిందర్ గోయల్ సుమారు 174 కోట్ల రూపాయలను (20 మిలియన్ డాలర్లను) ఇన్వెస్ట్ చేశారు. నాన్-ఎగ్జిక్యూటివ్ సహ-స్థాపకుడిగా మెంటర్షిప్, స్ట్రాటజిక్ గైడెన్స్ అందిస్తారు. సురోభి దాస్ రోజువారీ కార్యకలాపాలను నిర్వహిస్తారు. ఈ కంపెనీ 50 మిలియన్ డాలర్లను సేకరించాలని చూస్తోంది.