సీఎం కేసీఆర్ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం : సుహాసిని రెడ్డి

సీఎం కేసీఆర్ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం :  సుహాసిని రెడ్డి

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు: సీఎం కేసీఆర్​ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడని బీజేపీ నేత, జడ్పీ మాజీ చైర్​పర్సన్ సుహాసిని రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  శనివారం జిల్లా కేంద్రంలోని కేంద్రీయ గ్రంథాలయంలో నిరుద్యోగ అభ్యర్థులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా మరోసారి నిరుద్యోగుల జీవితాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వానికి ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ నిరుద్యోగుల జీవితాలపై లేదని ఎద్దేవా చేశారు. టీఎస్పీఎస్పీ గ్రూప్​వన్​ పేపర్ లీకేజీ ఘటన మరవకముందే రెండోసారి ప్రిలిమ్స్​ పరీక్ష రద్దవడం దారుణమన్నారు. వెంటనే టీఎస్పీఎస్సీ చైర్మన్​, సభ్యులు రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు. లేని పక్షంలో రాష్ర్ట వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నిరుద్యోగు యువతీ, యువకులు పాల్గొన్నారు.