2.38 కోట్ల డెవలప్​మెంట్​ వర్క్స్​కు తీర్మానం

2.38 కోట్ల డెవలప్​మెంట్​ వర్క్స్​కు తీర్మానం

పాలమూరు, వెలుగు: రూ.2.38 కోట్ల పదిహేనో ఫైనాన్స్​ ఫండ్స్​తో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు జడ్పీ పాలకవర్గం తీర్మానించింది. జడ్పీ చైర్ పర్సన్  స్వర్ణ సుధాకర్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం జడ్పీ మీటింగ్​ హాల్లో జిల్లా పరిషత్​ సర్వసభ్య సమావేశం జరిగింది. అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలు సభకు హాజరు కాలేదు.

ఈ సందర్భంగా చైర్ పర్సన్  మాట్లాడుతూ 15వ ఆర్థిక సంఘం నిధులను అభివృద్ధి పనులకు కేటాయిస్తూ తీర్మానించినట్లు తెలిపారు. స్కూల్స్, గవర్నమెంట్​ ఆఫీసుల్లో సౌలతులు కల్పించడంతో పాటు కౌకుంట్ల పీహెచ్​సీ బిల్డింగ్​ నిర్మాణానికి రూ.75 లక్షలు కేటాయించినట్లు చెప్పారు. ఇదిలాఉంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండడంతో ఎమ్మెల్యేలు హాజరు కాలేదని, ఈ సమయంలో జడ్పీ సమావేశం పెట్టడం సరికాదని జడ్పీ వైస్ చైర్మన్  యాదయ్య, జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.

దీంతో సభను ఈనెల 29న మరోసారి సమావేశం నిర్వహించనున్నట్లు జడ్పీ చైర్​పర్సన్​ తెలిపారు. జడ్పీ సీఈవో రాఘవేంద్రరావు, అడిషనల్  కలెక్టర్  శివేంద్ర ప్రతాప్, డిప్యూటీ సీఈవో శర్మ, జడ్పీటీసీలు కల్యాణి, అరవింద్ రెడ్డి, వెంకటేశ్వరమ్మ, నిర్మల పాల్గొన్నారు.