ఈ నెల 22 నుంచి ZPTC, MPTC ఎన్నికలు

ఈ నెల 22 నుంచి ZPTC, MPTC ఎన్నికలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 22 నుంచి మే 14లోగా ఈ ఎన్నికలు నిర్వహించాలని ఈసీకి ప్రతిపాదించింది. లోక్ సభ కౌంటింగ్ తర్వాత ఈ ఫలితాలను ప్రకటించాలని కోరింది.ఈ అంశంపై శు క్రవారం ప్రగతి భవన్ లో మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఇప్పటి కే పరిష త్ ఎన్ని-
కలకు ఈసీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావచ్చింది. నేడో రేపో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. మొత్తం 32 జిల్లా
పరిష త్ లకు, 535 జడ్పీటీసీలకు, 5,857 ఎంపీటీసీ స్థా నాలకు రెండు లేదా మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.