మహబూబ్ నగర్ జిల్లా : రైతుల ఖాతాల్లో రూ. 372 కోట్లు జమ

మహబూబ్ నగర్  జిల్లా : రైతుల ఖాతాల్లో రూ. 372 కోట్లు జమ

నాగర్ కర్నూల్ టౌన్/మహబూబ్​నగర్​ కలెక్టరేట్, వెలుగు: రైతు భరోసా కింద ఇప్పటి వరకు నాగర్​కర్నూల్​ జిల్లాలో 2,89,015 మంది రైతుల ఖాతాల్లో రూ.372.21 కోట్లు జమ చేసినట్లు కలెక్టర్  బదావత్  సంతోష్  తెలిపారు. రైతులకు ప్రభుత్వం  అందిస్తున్న రైతు భరోసా డబ్బులను పంట పెట్టుబడులకు వాడుకోవాలని సూచించారు. 

రానున్న రోజుల్లో మరింత మంది రైతులకు ఈ పథకం కింద ప్రయోజనం చేకూరేలా చూస్తామని తెలిపారు. మహబూబ్ నగర్  జిల్లాలో వానాకాలం పెట్టుబడి సాయం కింద 2,05,993 మంది రైతుల ఖాతాల్లో రూ.216 కోట్లు జమ చేసినట్లు డీఏవో బి.వెంకటేశ్​ తెలిపారు.