
నాగర్ కర్నూల్ టౌన్/మహబూబ్నగర్ కలెక్టరేట్, వెలుగు: రైతు భరోసా కింద ఇప్పటి వరకు నాగర్కర్నూల్ జిల్లాలో 2,89,015 మంది రైతుల ఖాతాల్లో రూ.372.21 కోట్లు జమ చేసినట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. రైతులకు ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా డబ్బులను పంట పెట్టుబడులకు వాడుకోవాలని సూచించారు.
రానున్న రోజుల్లో మరింత మంది రైతులకు ఈ పథకం కింద ప్రయోజనం చేకూరేలా చూస్తామని తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలో వానాకాలం పెట్టుబడి సాయం కింద 2,05,993 మంది రైతుల ఖాతాల్లో రూ.216 కోట్లు జమ చేసినట్లు డీఏవో బి.వెంకటేశ్ తెలిపారు.