హైదరాబాద్సిటీ, వెలుగు: 30వ యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్ (ఈయుఎఫ్ఎఫ్)కు నగరం వేదికగా మారింది. ప్రసాద్ ల్యాబ్ ప్రీవ్యూ థియేటర్, సారథి స్టూడియోస్, అలయన్స్ ఫ్రాంసేజ్లో శనివారం నుంచి ఈ చిత్రాల ప్రదర్శన జరుగుతోంది. ఈఫిలిం ఫెస్టివల్ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
వీరిలో యూరోపియన్ యూనియన్ భారత ప్రతినిధి బృందానికి చెందిన లొరెన్జో పారుల్లీ, సారథి స్టూడియోస్ చైర్మన్ ఎంఎస్ఆర్వీ ప్రసాద్, హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ అధ్యక్షుడు కె.వి.రావు, అలయన్స్ ఫ్రాంచైజ్హైదరాబాద్ డైరెక్టర్ మాడ్ మిక్వా, తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీరశంకర్, హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ శ్యాన్ జి.కే, ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తదితరులు ఉన్నారు.
