ఒకేరోజు 35 డెలివరీలు..అందరూ సేఫ్

ఒకేరోజు 35 డెలివరీలు..అందరూ సేఫ్

జనగామ, వెలుగు:  జనగామ మాతా శిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్)లో డాక్టర్లు మంగళవారం ఒకే రోజు రికార్డ్ స్థాయిలో 35 డెలివరీలు చేశారు. గడిచిన 24 గంటల్లో 35 కాన్పులు చేయగా తల్లులు, పిల్లలు అందరూ ఆరోగ్యంగా ఉన్నారని హాస్పిటల్ డాక్టర్లు తెలిపారు. ఈ డెలివరీల్లో 14 నార్మల్ కాగా 21 కాన్పులు సిజేరియన్​అయినట్లు చెప్పారు. ఈ కాన్పుల్లో 20 మంది మగపిల్లలు, 15 మంది ఆడపిల్లలు పుట్టారని వెల్లడించారు. 15 మంది మహిళలకు మొదటి కాన్పు జరిగిందని, వీరిలో 9 మందికి నార్మల్ డెలివరీలు, మిగతా ఆరుగురికి సిజేరియన్ అయిందని తెలిపారు. డెలివరీలు చేసిన డాక్టర్లు శోభ, రజిని, మనస్విని, సిస్టర్​లు మరియమ్మ, సంగీత, ఇతర స్టాఫ్ ను హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుగుణాకర్ రాజు, ఆర్ఎంఓ శంకర్ నాయక్ అభినందించారు. డాక్టర్ల పనితీరుపై గర్భిణీలు, వారి బంధువులు సంతోషం వ్యక్తం చేశారు.