
అనంతిక సనీల్ కుమార్, హను రెడ్డి లీడ్ రోల్లో ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన చిత్రం ‘8 వసంతాలు’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మిస్తున్నారు. జూన్ 20న సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఫస్ట్ టీజర్ను రిలీజ్ చేయగా, శనివారం సెకండ్ టీజర్ను రిలీజ్ చేశారు. ‘అమ్మాయిలకి కత్తి పట్టుకుని రౌద్ర రసం చూపేవాడు కంటే.. కన్నీళ్లు తుడుస్తూ కరుణ రసం చూపించేవాడు అంటేనే ఇష్టం’ అనే డైలాగ్ యూనివర్సల్గా కనెక్ట్ అవుతోంది.
‘ప్రేమ చేరుకోవడానికి ఒక గమ్యం కాదు, మనం చేయాల్సిన ప్రయాణం’ అనే హార్ట్ టచ్చింగ్ డైలాగ్ సినిమాలోని ఎమోషనల్ డెప్త్ని తెలియజేస్తోంది. రవితేజ దుగ్గిరాల, సంజన, కన్నా, స్వరాజ్ రెబ్బాప్రగడ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు.