
హాలీవుడ్ లో అదరగొడుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రం గోల్డెన్ గ్లోబ్ వేదికపై సత్తాచాటిన సంగతి తెలిసిందే. అయితే గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంగ్లీషులో ప్రసంగించగా, ఆయన యాసపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఈనేపథ్యంలో నటి కస్తూరి దీనిపై స్పందించారు. ఎన్టీఆర్ యాసను నెటిజన్లు విమర్శించడాన్ని ఆమె ఖండించారు. ఎన్టీఆర్ చక్కగా మాట్లాడారని, ఆయనపై ట్రోలింగ్ సరికాదన్నారు. అమెరికన్లకు అక్కడి యాసలో మాట్లాడితేనే అర్థమవుతుందని..ఎన్టీఆర్ చేసింది అదేనని, అందులో తప్పుబట్టడానికేమీ లేదన్నారు.
కస్తూరి నిత్యం సమాజంలోని పలు సమస్యలు స్పందిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. సామాజికవేత్తగా, న్యాయవాదిగా, పొలిటికల్ అనలిస్ట్గా నెట్టింట్లో రచ్చ చేస్తూ తరచూ ఏదో ఒక ఇష్యూపై రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఒకానొక సమయంలో వెండితెరపై తన మార్క్ చూపించిన హీరోయిన్ కస్తూరి.. ఇప్పుడు బుల్లితెపై రాణిస్తోంది. గృహలక్ష్మి సీరియల్ తో ప్రతి ఇంట సందడి చేస్తోంది.