బాయిల్డ్ రైస్ మిల్స్కు తడిసిన వడ్లు

బాయిల్డ్ రైస్ మిల్స్కు తడిసిన వడ్లు
  • అగ్రికల్చర్ కమిషన్ సభ్యుడు గంగాధర్​

నిజామాబాద్​, వెలుగు: వర్షాలకు తడిసిన వడ్లు బాయిల్డ్​ రైస్​ మిల్లులకు తరలించాలని అగ్రికల్చర్​ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్​ సూచించారు. సోమవారం మాక్లూర్​ మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు సెంటన్​ను​ విజిట్​ చేసి రైతులతో మాట్లాడారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం  లేదన్నారు.  

కొనుగోలు కేంద్రాల్లో సరిపడా టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. లారీలు, హమాలీ, అన్​లోడింగ్ సమస్య రాకుండా చూడాలన్నారు. అదనపు కలెక్టర్​ కిరణ్​కుమార్​, సివిల్​ సప్లయ్ డీఎం శ్రీకాంత్​రెడ్డి, డీఎస్​వో అరవింద్​రెడ్డి, డీసీవో శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.