సాయి ధరమ్ తేజ్ ను పరామర్శించిన అల్లు అర్జున్

సాయి ధరమ్ తేజ్ ను పరామర్శించిన అల్లు అర్జున్
  • గత శుక్రవారం బైకుపై వెళ్తూ జారిపడిన సాయి ధరమ్ తేజ్

హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువ హీరో సాయి ధరమ్ తేజ్ ను అల్లు అర్జున్ ఇవాళ పరామర్శించారు. సినిమా షూటింగులో బిజీగా ఉన్న అల్లు అర్జున్ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఫోన్లో ఆరా తీసి ఆస్పత్రి వైద్యులతో మాట్లాడారు. షూటింగులో బిజీగా ఉంటున్నప్పటికీ సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు. షూటింగు ముగించుకున్న ఆయన ఇవాళ గురువారం సాయంత్రం అపోలో ఆస్పత్రికి వెళ్లి సాయి ధరమ్ తేజ్ ను పరామర్శించారు. 
ఈనెల 10వ తేదీన గత శుక్రవారం రాత్రి హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జి మీదుగా స్పోర్ట్స్ బైకుపై వెళుతూ.. బండి స్కిడ్ కావడంతో జారిపడిన విషయం తెలిసిందే. స్థానికులు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించడంతో ప్రమాదం తప్పిపోయింది. అయినప్పటికీ కాలర్ బోన్ ఫ్రాక్చర్ జరిగినట్లు గుర్తించిన వైద్యులు దానికి శస్త్ర చికిత్స చేసి సరి చేశారు. వెంటిలేటర్ అవసరం తగ్గిపోయినా ఐసీయూలోనే ఉంచి చికిత్స కొనసాగించారు. ప్రస్తుతం కోలుకున్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా కోలుకున్నాక డిశ్చార్జి చేస్తామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.