బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ని చూసి దేశం గర్విస్తుంది

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ని చూసి దేశం గర్విస్తుంది

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ని చూసి దేశం గర్విస్తుందన్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. గుజరాత్ లో పర్యటించారు అమిత్ షా. గుజరాత్ సీఎం భూపేందర్ పటేల్ తో కలిసి నదేశ్వరి మాత ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారిని దర్శించుకోని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత బనస్కాంత జిల్లా నాడబెట్ లో భారత్ – పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దులో బోర్డర్ వ్యూ పాయింట్ ను ప్రారంభించారు. సమస్య ఎదురైనప్పుడు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎప్పుడు వెనుతిరగలేదన్నారు. దేశం కోసం ఎంతోమంది అమర వీరులు త్యాగాలు చేశారన్నారు.