అమిత్‌ షా కనబడుట లేదు..ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు

 అమిత్‌ షా కనబడుట లేదు..ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కనబడటం లేదంటూ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు అందింది. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) జాతీయ ప్రధాన కార్యదర్శి నగేష్‌ కరియప్ప ఆన్‌లైన్‌లో ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేశం కరోనా వైరస్ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ప్రజలు సంక్షోభంలో ఉన్నారని.. ఇలాంటి సమయంలో అమిత్‌షా కనిపించకుండా పోయారని నగేష్ కరియప్ప పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాజకీయ నాయకులు దేశానికి సేవ చేయాలే కానీ.. సంక్షోభ పరిస్థితుల్లో కన్పించకుండా పోవడం సరైంది కాదని ఆయన తన ఫిర్యాదులో తెలిపారు. ఢిల్లీ పోలీసులకు ఆన్‌లైన్‌లో చేసిన ఫిర్యాదు అక్నాలెడ్జ్‌మెంట్‌ను నగేష్‌ ట్వీట్‌ చేశారు .