వరద ప్రవాహంలో గల్లంతైన వృద్ధుడు

వరద ప్రవాహంలో గల్లంతైన వృద్ధుడు

నిర్మల జిల్లా: వరద ప్రవాహంలో గల్లంతైన వృద్ధుడు శవమై తేలాడు. ఈ సంఘటన మంగళవారం నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండలంలో చోటుచేసుకుంది. భారీ వర్షాలకు కంకట-ధోనిగాం బ్రిడ్జిపై నుండి వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. ప్రమాదకరమైన వాగుని దాటే ప్రయత్నంలో కంకట గ్రామానికి చెందిన బొమ్మెన లస్మన్న(54) ప్రవాహంలో కొట్టుకుపోయాడు.

స్థానికులు చాలాసేపు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఫలితంలేకుండా పోయింది. గంట తర్వాత కిలోమీటర్ దూరంలో ఉన్న పంట పొలాల్లో లస్మన్న మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న లస్మన్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు పోలీసులు.