
న్యూఢిల్లీ: ఇండియా నంబర్ వన్ విమెన్స్ స్వ్కాష్ ప్లేయర్ అనహత్ సింగ్ ప్రతిష్టాత్మక ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఏ) 2024–-25 ఇంటర్నేషనల్ అవార్డుల్లో డబుల్ ధమాకా మోగించింది. విమెన్స్ చాలెంజర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్, ఈజిప్ట్కు చెందిన అమీనా ఓర్ఫీతో కలిసి విమెన్స్ యంగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డులు గెలుచుకుంది. 17 ఏండ్ల వయసులోనే చాలెంజర్ సర్క్యూట్లో అద్భుతంగా ఆడుతున్న అనహత్ 2024–-25 స్క్వాష్ సీజన్లో టాప్ ప్లేయర్లలో చోటు దక్కించుకుంది.
ఆగస్టులో తన నేషనల్ టైటిల్ను నిలబెట్టుకున్న ఈ యంగ్స్టర్ కోల్కతాలో జరిగిన హెచ్సీఎల్ స్క్వాష్ టూర్ నెగ్గి ఈ సీజన్ను ఘనంగా ప్రారంభించింది. మొత్తంగా 11 టోర్నమెంట్లలో 9 టైటిళ్లు గెలుచుకుంది. ఒక దశలో అనహత్ వరుసగా 29 మ్యాచ్ల్లో అజేయంగా నిలిచింది. మార్చిలో ముంబైలో జరిగిన ఇండియన్ ఓపెన్లో సీనియర్ ప్లేయర్ జోష్నా చిన్నప్పను ఓడించి టైటిల్ నెగ్గి సంచలనం సృష్టించింది. హాంకాంగ్లో జరిగిన ఆసియా జూనియర్ టీమ్ చాంపియన్షిప్లో ఇండియాకు కాంస్యం అందించడంతో అనహత్ పీఎస్ఏ ర్యాంకింగ్స్లో టాప్– 70లోకి వచ్చి ఇండియా నంబర్ వన్ విమెన్ ప్లేయర్గా ఎదిగింది. ప్రస్తుతం వరల్డ్ ర్యాంకింగ్స్లో తను 56వ ప్లేస్లో ఉంది.