పంజాబ్ లోని గోల్డెన్ టెంపుల్ సమీపంలో మరోసారి బాంబు పేలుడు సంభవించింది. ఉదయం 6:30 గంటలకు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలను సేకరిస్తున్నాయి. ఈ ఘటనకు ముందురోజు అంటే మే 07 ఆదివారం రోజున న కూడా గోల్డెన్ టెంపుల్ సమీపంలోని హెరిటేజ్ స్ట్రీట్లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్దారు.
ఒకే చోట వరుసగా పేలుళ్లు జరగడంతో ఆ ప్రాంతంలో పోలీసులు మరింత భద్రతను పెంచారు. ఈ పేలుడు వెనక కారణమేంటో విచారణ చేపడుతున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, ఈ ఘటనపై నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు దర్యాప్తు కొనసాగుతోందని, ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని అమృత్సర్ పోలీసులు చెబుతున్నారు.