గోల్డెన్ టెంపుల్ సమీపంలో మరోసారి బాంబు పేలుడు

గోల్డెన్ టెంపుల్ సమీపంలో మరోసారి బాంబు పేలుడు

పంజాబ్ లోని గోల్డెన్ టెంపుల్ సమీపంలో మరోసారి బాంబు పేలుడు సంభవించింది.  ఉదయం 6:30 గంటలకు  పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు.  ఘటన స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలను సేకరిస్తున్నాయి. ఈ ఘటనకు ముందురోజు అంటే మే 07 ఆదివారం రోజున న కూడా  గోల్డెన్ టెంపుల్ సమీపంలోని   హెరిటేజ్ స్ట్రీట్‌లో  పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్దారు.  

ఒకే చోట వరుసగా పేలుళ్లు జరగడంతో ఆ ప్రాంతంలో పోలీసులు మరింత భద్రతను పెంచారు.   ఈ పేలుడు వెనక కారణమేంటో విచారణ చేపడుతున్నారు.  ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, ఈ   ఘటనపై నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు దర్యాప్తు కొనసాగుతోందని, ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని అమృత్‌సర్ పోలీసులు చెబుతున్నారు.