
హైదరాబాద్, వెలుగు:జీహెచ్ఎంసీలోని 24 బార్లకు ఎక్సైజ్ శాఖ దరఖాస్తులను ఆహ్వానించింది. వీటితో పాటుగా సరూర్నగర్ జల్పల్లి, మహబూబ్నగర్, నిజామాబాద్, బోధన్లో ఒక్కొక్క బార్కు దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేసింది. జీహెచ్ఎంసీలో 24 బార్లకు 359 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 6 వరకు గడువు ఉందని అధికారులు తెలిపారు.
24 బార్లకు మిగిలిన మూడు రోజుల్లో భారీగా దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు. రాబోయే మూడు రోజుల్లో బార్లకు వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని భావించి అధికారులు నాంపల్లిలోని అబ్కారీ భవన్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దరఖాస్తులు తీసుకొవడానికి నాంపల్లి కార్యాలయంలో ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు పేర్కొన్నారు.