
- 2 నెలల ట్రైనింగ్ ఇచ్చి నియామకాలు
- ఈ నెల 17 వరకు దరఖాస్తుల స్వీకరణ
నిజామాబాద్, వెలుగు: జిల్లాలో లైసెన్స్డ్ ల్యాండ్ సర్వేయర్లను నియమించేందుకు కసరత్తు మొదలయ్యింది. భూభారతి స్కీమ్ ద్వారా భూసమస్యలను పరిష్కరించేందుకు రైతుల భూమి కొలతలు తీయాల్సిఉంది. సర్వేయర్ల కొరత కారణంగా లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంపికయిన లైసెన్స్డ్ సర్వేయర్లకు జిల్లాలోని పర్మనెంట్సర్వేయర్లు ఈనెల 26 నుంచి జులై 26 వరకు శిక్షణ ఇస్తారు. వారికి ఎగ్జామ్స్, అసెస్మెంట్ టెస్ట్నిర్వహించి భర్తీ చేయనున్నారు.
అర్హతలివే..
ఈ నెల 17 నాటికి 18 నుంచి 35 సంవత్సరాల వయస్సున్నవారు ఈ పోస్ట్కు అర్హులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్ల సడలింపు ఇచ్చారు. అభ్యర్థులు ఇంటర్మీడియట్లో కనీసం 60 శాతం మార్కులతో మ్యాథ్స్పాస్ అయి ఉండాలి. సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు నిర్వహించిన సివిల్ ట్రేడ్లో గానీ, పాలిటెక్నిక్లో సివిల్ ఇంజినీరింగ్ డిప్లొమాగానీ, సర్వేయర్ ఎస్టిమేటర్ కోర్సులో గానీ పాస్ కావాలి. ఆల్ ఇండియా సర్వేయర్ల సంస్థ ఆధ్వర్యంలోని ఇంటర్మీడియేట్ ల్యాండ్ సర్వేయింగ్లో సర్టిఫికేట్ పొందిన వారు, వొకేషనల్ కాలేజీలో కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, వాటర్ సప్లై, శానిటరీ ఇంజినీరింగ్, ల్యాండ్ సర్వేయర్కోర్స్పూర్తి చేసిన వారు ఈనెల 17 వరకు ఆన్లైన్లో అప్లికేషన్పెట్టుకోవాలి.
రాష్ట్రంలో 5 వేల మంది లైసెన్స్డ్సర్వేయర్లను నియమించనున్నారు. జిల్లాకు 150 మందిని నియమిస్తారు. పర్మనెంట్ సర్వేయర్ల దగ్గర రెండు నెలల పాటు శిక్షణ ఇచ్చి ఆతర్వాత మూడు అంశాల్లో పరీక్ష పెడతారు. కనీసం 70 శాతం మార్కులు వచ్చిన వారినుంచి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారు 40 రోజుల అప్రెంటిస్లుగా పని చేసిన తర్వాత అసెస్మెంట్టెస్ట్ నిర్వహిస్తారు. ఈ టెస్ట్లో పాస్ అయితేనే లైనెన్స్ ఇచ్చి సర్వేయర్గా నియమిస్తారు. భూభారతి చట్టం అన్ని మండలాల్లో అమలులోకి వచ్చే సమయానికి లైనెన్స్డ్ సర్వేయర్ల భర్తీ పూర్తి చేయాలని భావిస్తున్నారు. జిల్లాలో 33 మండలాలుండగా.. మండలానికి నలుగురి చొప్పున వీరిని నియమిస్తారు.
అర్హతలున్నవారు అప్లై చేసుకోవాలి
భూభారతి స్కీమ్లో లైనెన్స్డ్ సర్వేయర్ల అపాయింట్మెంట్కు చర్యలు తీసుకుంటున్నాం. అర్హతలున్న వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తాం. యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.
రాజీవ్గాంధీ హనుమంతు, కలెక్టర్