భారత్ పై గెలిచే అవకాశాలు మాకే ఎక్కువ : బాబర్ ఆజామ్

భారత్ పై గెలిచే అవకాశాలు మాకే ఎక్కువ  : బాబర్ ఆజామ్

కాసేపట్లో భారత్ తో జరిగే మ్యాచ్ లో గెలిచేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ అన్నారు.  అసియా కప్ కు ముందు తాము శ్రీలంకతో మ్యాచ్ ఆడటం తమకు కలిసి వస్తుందని చెప్పారు.  అయితే టీమిండియాను తక్కువ అంచనా వేయలేమన్న బాబర్..  ఇవాళ్టి మ్యాచ్ లో గెలుపు అవకాశాలు తమకే ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. 

అయితే మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయకపోవడమే తమకున్న ఏకైక సమస్యని తెలిపాడు.  ఈ ఒక్క బలహీనతను అధిగమిస్తే పాకిస్థాన్ జట్టుకు తిరుగుండదని చెప్పాడు. వాతావరణం అనేది ఎవరీ  చేతిల్లో లేని విషయం,  ప్రాక్టీస్‌ కూడా బాగా సాగింది. ఆదివారం కూడా ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నాం. మ్యాచ్ సజావుగా జరుగుతుందని భావిస్తున్నామని చెప్పుకొచ్చాడు.  

 ఈ టోర్నీ లీగ్‌ దశలో భారత్-, పాక్ మ్యాచ్‌ వర్షం వల్ల రద్దవ్వగా.. ఎలాంటి ఇబ్బందీ లేకుండా సూపర్‌-4లో అడుగు పెట్టిన రెండు జట్లూ ఆదివారం మరోసారి తలపడుతున్నాయి.  సూపర్‌-4 మ్యాచ్‌ పిచ్‌ కూడా బౌలర్లకే అనుకూలమన్న అంచనాల నేపథ్యంలో భారత్‌కు గట్టి సవాల్ ఎదురుకానుంది.