
- బక్కి వెంకటయ్య
బషీర్బాగ్, వెలుగు: దళితులపై దాడులను ఉపేక్షించబోమని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హెచ్చరించారు. ఇటీవల మెదక్ జిల్లా హవేలిఘనాపూర్ మండలం బూర్గపల్లి జడ్పీ హైస్కూల్లో గిరిజన ఇంగ్లిష్ టీచర్ నరేందర్ నాయక్ పై జరిగిన దాడిని ఆయన ఖండించారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో దళిత బహుజన ఫ్రంట్(డీబీఎఫ్) జాతీయ కార్యదర్శి పి.శంకర్, గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వెంకటేశ్చౌహన్, గిరిజన జేఏసీ లీడర్ రాజేశ్నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బక్కి వెంకటయ్య మాట్లాడారు.
ఎస్సీ, ఎస్టీలపై దాడులను అరికట్టేందుకు త్వరలో సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రొఫెసర్ కె.లక్ష్మినారాయణ, కమిషన్ సభ్యులు రాంబాబునాయక్, నాయకులు శ్రీరాములు, రాజేందర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.