ఏడబ్ల్యూఎస్ మార్కెట్ప్లేస్ విస్తరణ

ఏడబ్ల్యూఎస్  మార్కెట్ప్లేస్ విస్తరణ

హైదరాబాద్​, వెలుగు: అమెజాన్​ వెబ్​ సర్వీసెస్​ (ఏడబ్ల్యూఎస్​) తన ఏడబ్ల్యూఎస్​ మార్కెట్​ప్లేస్​ను భారతదేశంలో విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విస్తరణతో ఇక నుంచి భారతదేశంలోని కస్టమర్‌‌‌‌‌‌‌‌లు సిస్కో, క్రౌడ్‌‌‌‌‌‌‌‌స్ట్రైక్, సేల్స్‌‌‌‌‌‌‌‌ఫోర్స్ లాంటి టెక్నాలజీ ప్రొవైడర్ల నుంచి సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ సేవలను రూపాయల్లో కొనుగోలు చేయవచ్చు.

 దీని ద్వారా స్థానిక ఇన్​వాయిసింగ్ సాధ్యమవుతుంది. ఇండియాకు చెందిన ఐఎస్​వీలు (ఇండిపెండెంట్​ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్​ వెండర్స్​) కన్సల్టింగ్​ భాగస్వాములు తమ ఉత్పత్తులను రూపాయల్లోనే అమ్మవచ్చని తెలిపింది. దీనివల్ల పన్ను ఇబ్బందులు తగ్గుతాయని, ఈ కొత్త విధానం భారతదేశ డిజిటల్​ ఆర్థిక వ్యవస్థ వేగాన్ని పెంచుతుందని ఏడబ్ల్యూఎస్​ తెలిపింది.