పెద్దమ్మ ఆలయానికి రూ. పది లక్షలు మంజూరు : బండ ప్రకాశ్ ముదిరాజ్​

పెద్దమ్మ ఆలయానికి రూ. పది లక్షలు మంజూరు : బండ ప్రకాశ్ ముదిరాజ్​

లింగంపేట, వెలుగు :  పర్మల్ల  గ్రామ పెద్దమ్మ ఆలయ అభివృద్ధికి రూ.పది లక్షలు మంజూరు చేస్తున్నట్లు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ముదిరాజ్ చెప్పారు. బుధవారం  పెద్దమ్మ  విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవంలో పాల్గొని పూజలు చేసిన అనంతరం మాట్లాడారు. ఆదిలాబాద్​ నుంచి ఆలంపూర్ వరకు ప్రతి పల్లెలో ముదిరాజ్ కులస్తులు పెద్దమ్మ ఆలయాలను  నిర్మించారన్నారు. రాష్ట్రంలో 80 శాతం మత్స్యసహకార సొసైటీల్లో ముదిరాజ్​లే ఉన్నారన్నారు. 

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ముదిరాజ్​లు సత్తాచాటాలని పిలుపునిచ్చారు.  కార్యక్రమంలో రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బుర్ర జ్ఞానేశ్వర్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్​మోహనరావు, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిజ్జన రమేశ్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు బట్టు విఠల్,​ లింగంపేట మండలాధ్యక్షుడు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.