
- భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్
భద్రాచలం, వెలుగు : గోదావరి తీరంలో నిమజ్జనాల సమయంలో అలర్ట్గా ఉండాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి గురువారం సాయంత్రం ఆయన భద్రాచలం గోదావరి వద్ద నిమజ్జనాల ఏర్పాట్లపై సమీక్షించారు. జరిపారు. ప్రమాదాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా, సురక్షితంగా నిమజ్జనాలు జరిగేలా మండపాల నిర్వాహకులు, ఆఫీసర్లు సమన్వయంతో పనిచేయాలన్నారు.
ఘాట్ వద్ద లాంచీలు, బారికేడింగ్, లైటింగ్, సీసీ కెమెరాల పర్యవేక్షణ, తాగునీరు, వైద్యం, గజ ఈతగాళ్లు వంటి ఏర్పాట్లు పూర్తి చేసి24 గంటలూ భక్తులకు అందుబాటులో ఆఫీసర్లు ఉండాలని సూచించారు. వీరి వెంట ఈఈ జానీ, తహశిల్దారు వెంకటేశ్వర్లు, ఈవో శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.