జీవో 317ను సవరించాలె.. సమస్య పరిష్కరించకుంటే పోరు ఉధృతం

జీవో 317ను సవరించాలె.. సమస్య పరిష్కరించకుంటే పోరు ఉధృతం

ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. జీవో 317ను సవరించాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి రేపు రాత్రి బీజేపీ ఆధ్వర్యంలో జాగరణ కార్యక్రమం చేపడతామని.. ఆదివారం రాత్రంతా మేల్కొని ప్రభుత్వానికి నిరసన తెలుపుతామన్నారు. ఉద్యోగులకు బీజేపీ అండగా ఉంటుందన్నారు సంజయ్.