బాక్సింగ్ లో సంచలనం సృష్టించిన తెలంగాణ ఆణిముత్యం నిఖిత్ జరీన్ పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారుమోగుతోంది. టర్కీలోని ఇస్తాంబుల్ లో జరిగిన వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో నిఖిత్ పసిడి పతకాన్ని సాధించి దేశానికే గర్వకారణంగా నిలిచింది. మారుమూరు ప్రాంతం నుంచి వచ్చిన జరీన్... ఇప్పుడు అందరూ చెప్పుకునే స్థాయికి ఎదగడానికి ఆమె చేసిన కృషి, పట్టుదలను ఎంత కొనియాడినా తక్కువే. కాగా ఈ నేపథ్యంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ తమ ఆనందాన్ని, అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 52 కిలోల కేటగిరీ ఫైనల్ బౌట్ లో 5-0లో థాయ్ బాక్సర్ జిట్ పాంగ్ పై తిరుగులేని విజయం సాధించిన నిఖత్.. త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగరేసేలా చేసిన జరీన్ దేశానికే గర్వకారణమంటూ చేసిన విషెష్ కు ఆమె తాజాగా వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ పలు పోస్ట్ లు చేసింది. అందులో సూపర్ స్టార్ మహేశ్ బాబు, షాహిద్ కపూర్, సునీల్ శెట్టి, విజయ్ దేవరకొండ లాంటి పలవురు సినీ ప్రముఖులతో పాటు, మిథాలీ రాజ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ లాంటి క్రీడాకారులు, రేవంత్ రెడ్డి, పియూష్ గోయల్, ఎం.కె. స్టాలిన్ లాంటి రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు.
మరిన్ని వార్తల కోసం...