
పాలకుర్తి, వెలుగు: జనగామ జిల్లా పాలకుర్తిలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం నెలకొన్నది. ప్రభుత్వం ప్రకటించిన అధికారిక విగ్రహాన్ని కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేస్తుండగా, పాత విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ బీఆర్ఎస్నాయకులు ఆందోళనకు దిగారు. శనివారం విగ్రహ ఏర్పాటు పనులు మొదలు పెట్టగా, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పసునూరి నవీన్, మాజీ జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాస రావు కార్యకర్తలతో వచ్చి సెంట్రింగ్ను పీకేశారు. పోలీసులు అడ్డుకోగా కాసేపు తోపులాట జరిగింది.
అర్ధరాత్రి వరకు కాంగ్రెస్ నేతలు అక్కడే విగ్రహ ఏర్పాటు పనులు పూర్తి చేయించారు. ఆదివారం ఉదయం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సతీమణి ఎర్రబెల్లి ఉష పాలకుర్తికి చేరుకొని పార్టీ ఆఫీస్నుంచి కార్యకర్తలతో పోలీస్స్టేషన్ కుర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించారు. అనంతరం వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్యకు కంప్లైంట్ చేశారు. కాగా, నేడు ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రి పొంగులేని శ్రీనివాస్రెడ్డి స్థానిక ఎమ్మెల్యేతో కలిసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.