పాలకుర్తిలో తెలంగాణతల్లి విగ్రహం పంచాయితీ

పాలకుర్తిలో తెలంగాణతల్లి విగ్రహం పంచాయితీ

పాలకుర్తి, వెలుగు: జనగామ జిల్లా పాలకుర్తిలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు విషయంలో బీఆర్ఎస్,​ కాంగ్రెస్‌ నాయకుల మధ్య వాగ్వాదం నెలకొన్నది. ప్రభుత్వం ప్రకటించిన అధికారిక విగ్రహాన్ని కాంగ్రెస్​ నాయకులు ఏర్పాటు చేస్తుండగా, పాత  విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ బీఆర్ఎస్​నాయకులు ఆందోళనకు దిగారు. శనివారం విగ్రహ ఏర్పాటు పనులు మొదలు పెట్టగా, బీఆర్ఎస్​ మండలాధ్యక్షుడు పసునూరి నవీన్, మాజీ జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాస రావు కార్యకర్తలతో వచ్చి సెంట్రింగ్​ను పీకేశారు. పోలీసులు అడ్డుకోగా కాసేపు తోపులాట జరిగింది. 

అర్ధరాత్రి వరకు కాంగ్రెస్​ నేతలు అక్కడే విగ్రహ ఏర్పాటు పనులు పూర్తి  చేయించారు. ఆదివారం ఉదయం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు సతీమణి ఎర్రబెల్లి ఉష పాలకుర్తికి చేరుకొని పార్టీ ఆఫీస్​నుంచి కార్యకర్తలతో పోలీస్​స్టేషన్ కు​ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించారు. అనంతరం వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్యకు కంప్లైంట్​ చేశారు. కాగా, నేడు ఉమ్మడి వరంగల్​ జిల్లా మంత్రి పొంగులేని శ్రీనివాస్​రెడ్డి స్థానిక ఎమ్మెల్యేతో కలిసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.