దేశంలో మరో రెండు కొత్త టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లులు రానున్నాయి. ఈ రెండు కొత్త ప్రతిపాదనలతో మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని శివపురి, రతపానిలో రిజర్వ్ కేంద్రాలు ఏర్పడనున్నాయి. ఈ రెండింటి ఏర్పాటుతో మధ్యప్రదేశ్ రాష్ట్రం అత్యధిక సంఖ్యలో పులులు ఉన్న రాష్ట్రంగా అవతరించింది. ఇప్పటికే ఆరు టైగర్ రిజర్వ్ లు, పది జాతీయ ఉద్యానవనాలు మధ్యప్రదేశ్లో విస్తరించి ఉన్నాయి. శివపురిలో మాధవ్ నేషనల్ పార్క్ ను ప్రత్యేక టైగర్ రిజర్వ్ గా ఏర్పాటు చేసేందుకు ఆ రాష్ట్రం కేంద్రాన్ని పర్మిషన్ కోరింది. దీనితో పాటు ఆ రాష్ట్ర సీఎం నుండి క్లియరెన్స్, ప్రజల ఆమోదం తర్వాత రతపాని దగ్గర మరో టైగర్ రిజర్వ్ ఏర్పాటు చేయనున్నారు.
మరిన్ని వార్తల కోసం..