రెచ్చిపోయిన శ్రీకాళహస్తి మహిళా సీఐ..జనసేన నేతకు చెంప దెబ్బలు

రెచ్చిపోయిన శ్రీకాళహస్తి మహిళా సీఐ..జనసేన నేతకు చెంప దెబ్బలు

 వివాదాస్పద పోలీసు అధికారిణి అంజూయాదవ్ ప్రవర్తన మరోసారి కలకలం రేపింది.  సీఎం జ‌గ‌న్ దిష్టి బొమ్మను ద‌గ్డం చేస్తావా అంటూ జ‌న‌సేన నాయ‌కుడి చెంప చెళ్లు మ‌నిపించింది.  తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్తల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. జనసేన అధినేత పవన్‌పై సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగా పట్టణంలోని పెళ్లిమండం వద్ద సీఎం దిష్టిబొమ్మను దహనం చేసేందుకు జనసేన నేతలు యత్నించారు.

జనసేన నేతలపై దాడి చేసిన సీఐ అంజూ యాదవ్

సీఎం జగన్  దిష్టిబొమ్మ దహనానికి అంగీకరించబోమని మహిళా సీఐ అంజు యాదవ్‌ వారికి తెలిపారు. ఆ తర్వాత దిష్టిబొమ్మ దహనానికి యత్నించడంతో పలువురు నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. జనసేన నేతలు పోలీసులను  శ్రీకాళహస్తిలో ఒక  కూడలి వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో జనసేన నేతలపై సీఐ చేయిచేసుకున్నారు. ఓ నేత రెండు చెంపలపైనా ఆమె కొట్టారు. ఆమె తీరుపై జనసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె వెంట‌నే క్షమాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు.. న‌డిరోడ్డుపై త‌మ నేత‌పై చేయి చేసుకున్న సీఐని స‌స్పెండ్ చేయాల‌ని నినాదాలు చేశారు..