
మెదక్ టౌన్, వెలుగు : కేంద్ర ప్రభుత్వ అమలు చేస్తున్న మతోన్మాద, కార్పొరేట్ విధానాలను తిప్పికొట్టాలని, దీనికి సంబంధించి తలపెట్టిన జులై 9న దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు అన్నారు. సీఐటీయూ మెదక్ జిల్లా కమిటీ సమావేశాన్ని శనివారం మెదక్ పట్టణంలోని కేవల్కిషన్భవనంలో జిల్లా అధ్యక్షురాలు బాలమణి అధ్యక్షతన నిర్వహించగా, ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను మార్చి 4 లేబర్ కోడ్స్ తీసుకువచ్చిందని, లేబర్ కోడ్స్అమలు చేయడం అంటే కార్మికులు పోరాడి సాధించుకొన్న చట్టాలను నిర్వీర్యం చేయడమేనన్నారు.
కేంద్రం మెడలు వంచేందుకే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశ వ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాలమణి, మల్లేశం, జిల్లా కోశాధికారి నర్సమ్మ, ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, కడారి నాగరాజు, బస్వరాజు, సహాయ కార్యదర్శులు సంతోష్, నాగేందర్ రెడ్డి, అన్నపూర్ణ, గౌరయ్య, కమిటీ సభ్యులు కుమార్, భాగయ్య పాల్గొన్నారు.